తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ సీనియర్ నేతలపై మరోసారి ఘాటు ఆరోపణలు గుప్పించారు.
హరీష్ రావు ఇటీవల మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించారని ఆమె ఆరోపించారు. ఆ సమావేశంలో హరీష్ రావు “ఎన్టీఆర్ గొప్ప నాయకుడు, కానీ ఆయన కొడుకు వారసత్వం కొనసాగించలేకపోయాడు. కేసీఆర్ కూడా గొప్ప నాయకుడే, కానీ ఆయన కొడుకు వారసుడు కాలేడు. నేనే కేసీఆర్ వారసుడిని. మెదక్ గెలిచి బీజేపీలో చేరతాం” అని చెప్పారని ఒక ఎమ్మెల్యే తనకు చెప్పినట్లు కవిత పేర్కొన్నారు.
హరీష్ రావు ఆర్ఎస్ఎస్ ప్రముఖుడితో రహస్యంగా కలుస్తున్నారని, రాజ్పుష్ప ఓపెన్ స్కై విల్లాస్లో పసుపు-మిరియాలు కలిపిన పాలతో సత్కరించడం ఆ సమావేశాలకు సూచనలని ఆమె అన్నారు.
ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు పాల వ్యాపారం ద్వారా క్విడ్ ప్రో కో జరిగిందని కవిత మరో ఆరోపణ చేశారు. నారాయణ, చైతన్య కాలేజీలకు నెలకు రూ.5 కోట్ల చొప్పున పాలు సరఫరా చేసి ఎనిమిది సంవత్సరాల్లో రూ.960 కోట్ల వ్యాపారం జరిగిందని, కిమ్స్, కామినేని, యశోద వంటి కార్పొరేట్ ఆసుపత్రులకు కూడా సరఫరా చేశారని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసురుతూ, లండన్లో హరీష్ రావుతో ఏ అవగాహన లేకపోతే ఆయనపై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.