ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా వర్తిస్తుంది. దృశ్యంతో ఫ్యామిలీ థ్రిల్లర్ అనే సరికొత్త జానర్ పరిచయం చేసిన దర్శకుడు జీతూ జోసెఫ్ అలాంటి కథతో రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించారు. పదమూడు సంవత్సరాల క్రితం 2013లో మొదలైన ఈ ఫ్రాంచైజ్ తొలి భాగం బ్లాక్ బస్టర్ అయ్యాక ఇతర బాషల నుంచి వెంకటేష్, అజయ్ దేవగన్, కమల్ హాసన్, రవిచంద్రన్ లాంటి స్టార్లు ఏరికోరి రీమేక్ చేసుకున్నారు.

వీళ్ళందరూ మంచి హిట్లు అందుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత కరోనా టైంలో దృశ్యం 2 వచ్చింది. థియేటర్స్ లో వర్కౌట్ కాదని భావించి నేరుగా థియేటర్ రిలీజ్ చేశారు. వెంకటేష్ రీమేక్ కూడా అదే బాట పట్టింది. డిజిటల్ కాబట్టి హిట్టయ్యిందో ఫ్లాప్ అయ్యిందో గుర్తించే ఛాన్స్ లేకుండా పోయింది. వ్యూస్ అయితే మిలియన్లలో వచ్చి పడ్డాయి. ఈ సంవత్సరం దృశ్యం 3 వచ్చింది. వెంకటేష్ ఈసారి మూడో భాగం వద్దనుకున్నారు. దీంతో డబ్బింగ్ చేసి మోహన్ లాల్ నే చిట్టిబాటుగా చూపించేశారు.

కేరళలో దృశ్యం 3 ఆడింది కానీ మిగిలిన చోట్ల ఆడలేదు. కథను ఎలా సాగదీయాలో అర్థం కాక క్లైమాక్స్ ని ఖంగాళీ చేయడం చాలా మందికి నచ్చలేదు. పైగా చివరి అరగంట ట్విస్టుల కోసం రెండు గంటలు టీవీ సీరియల్ తరహాలో స్క్రీన్ ప్లే నడవడం ఇంకో మైనస్ అయ్యింది. రిలీజైన టైంలోనే దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ ఇకపై కొనసాగింపు ఉండదనే హింట్ ఇచ్చారు. తీరా ఇప్పుడు చూస్తేనేమో ఒక ఈవెంట్ లో ఆయన తరఫున నిర్మాత ప్రకటన ఇచ్చేశారు.

ఏదో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి కథలంటే ఏమో అనుకోవచ్చు కానీ దృశ్యంని ఈ రకంగా ఇంకా లాగుతూ ఉండటం విచిత్రం. అక్టోబర్ లో విడుదల కానున్న అజయ్ దేవగన్ దృశ్యం 3కి వేరే కథ రాసుకున్నారట. మెయిన్ పాయింట్ దగ్గరగా ఉన్నప్పటికీ ట్రీట్ మెంట్, క్లైమాక్స్ డిఫరెంట్ గా ఉంటాయట. అందుకే మోహన్ లాల్ వెర్షన్ ఓటిటిలో వచ్చినా దర్శక నిర్మాతలు టెన్షన్ పడటం లేదు. చూస్తుంటే దృశ్యం 4 ఇంకో ఏడాదిలో వచ్చినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.

Leave a Reply

Join the Frontpage Family

Get the latest political news, updates, and insights from Andhra Pradesh & Telangana delivered straight to your inbox.

You May Also Like